చిత్తూరు జిల్లాలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పాకాల-చిత్తూరు మార్గంలోని విద్యార్థులు ఉదయాన్నే కాలేజీలకు వెళ్తుంటారు. గతంలో 8 బస్సులు ఉండగా.. ప్రస్తుతం నాలుగే తిరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఫ్రీ బస్ కారణంగా మహిళా ప్రయాణికులు పెరిగారని.. సీట్లు లేకపోయినా సమయానికి కాలేజీలకు వెళ్లేందుకు ఇలా వేలాడుతూ వెళ్తున్నామని వాపోతున్నారు.