CTR: పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో క్రీడాకారులకు విశ్రాంత DSP సుకుమార్ బాబు ఉచితంగా స్పోర్ట్స్ మెటీరియల్ను అందజేశారు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం గ్రామంలో నిర్వహించిన వాలీబాల్, షటిల్ వివిధ రకాల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.