VZM: గుడ్డ సంచులను వినియోగించడం వల్ల భావితరాల భవిత భద్రంగా ఉంటుందని రాజాం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావు అన్నారు. ఈరోజు స్దానిక మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆయన చేతులమీదుగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్లాస్టిక్ సంచుల వినియోగించడం ద్వారా వాతావరణం కలుషితమై పర్యావరణ పరిరక్షణ దెబ్బ తింటోందని అన్నారు.