GNTR: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సోమవారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి, కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, ప్రజలకు న్యాయం చేయడంలో అలసత్వం వహించవద్దని సూచించారు.