ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం నిజరూప దర్శనంలో భక్తులకు కనువిందు చేశాడు. పురోహితులు రామకృష్ణ ఉదయాన్నే స్వామి మూల విరాట్కు పంచామృత, ఏకవార రుద్రాభిషేకం తదితర అభిషేకాలు చేపట్టి మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.