BPT: చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దీ రోజుల క్రితం కర్లపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన మరకా రాజు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రైవేటు వైద్యశాలకు తరలించి, చికిత్స అందిస్తుండగా ఆదివారం రాత్రి మృతిచెందారు.