CTR: బైరెడ్డిపల్లె మండలంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బైక్పై వెళ్తున్న సమద్, బాబా, రఫీని తీర్థం గ్రామం సచివాలయం సమీపంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు.