W.G: ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకానికి ఇన్ని షరతులు విధించడం సరికాదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పగడ్బందీగా అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బలరాం అన్నారు. శనివారం భీమవరంలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం’ పథకం అమలులో షరతులు పెట్టడం అన్యాయమని విమర్శించారు.