హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా నెలక్రితం లెబనాన్లో పేజర్లు పేలిన నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోటొరోలా మొబైల్ ఫోన్ల దిగుమతి, వినియోగం, విక్రయాలపై బ్యాన్ విధించింది. ఇరాన్ పరిధిలో ఆన్లైన్లోనూ మోటొరోలా ఫోన్ల సేల్స్ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అన్ని విమానాల్లో వాకీటాకీలు, పేజర్ల వినియోగాన్ని కూడా ఇరాన్ ఇటీవలే నిషేధించిన విషయం తెలిసిందే.