VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేకువజాము నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీదళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజలలో ఇద్దరు ఉభయ దాతలు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ప్రజల అస్తిత్వానికి సుస్థిర కోటను నిర్శించేది మాతృభాషేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేళ విషెస్ చెప్పిన ఆయన.. భవిష్యత్ తరాలు ‘నీవెవరు’ అని అడిగితే చెప్పడానికి సమాధానం భాష, సంస్కృతులేనన్నారు. మన తెలుగును మనం కాకపోతే ఎవరు గుర్తించి కాపాడుకుంటారని ప్రశ్నించారు. మాతృభాషపై పేరెంట్స్ మమకారం పెంచుకుని, పిల్లలకు నేర్పించాలని సూచించారు.
KNR: మానకొండూర్ మండలం రంగంపేటలో శ్రీ మేడలంబ కేతకాంబ సమేత మల్లిఖార్జున స్వామి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PDPL: అంతర్గాం మండలం గోలివాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఖాజామియా అనే రైతు విక్రయానికి సిద్ధంగా ఉంచిన సుమారు 10 క్వింటాళ్ల పత్తి మంటల్లో చిక్కుకుంది. స్థానికులు శ్రమించి మంటలను ఆర్పినప్పటికీ, అప్పటికే సగం పంట దగ్ధమై రైతుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు.
BDK: రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్లోని నిధులను విడతలవారీగా మంజూరు చేస్తున్నది. ఈ క్రమంలోనే శుక్రవారం మూడో విడతకుగాను రూ.387.53 కోట్లను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రానికి మొత్తం రూ.1,034.42 కోట్ల మేర నిధులు అందాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగేందుకు ఈ నిధులు కీలకంగా ఉపయోగపడనున్నాయి.
WGL: జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని DEO శ్రీధర్ సుమన్ ఆదేశించారు. CS, DOలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 6,003 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారని వెల్లడించారు.
CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉపయోగించిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్, స్పోర్ట్స్, కిచెన్ పరికరాలకు ఈనెల 23న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రశాంత్ నగర్ పోలీస్స్టేషన్లో వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఏ సెక్షన్ సూపరింటెండెంట్ పుష్పరాజ్ను సంప్రదించాలని సూచించారు.
సీనియర్ నటి మీనా తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపై తీవ్రంగా స్పందించింది. భర్త విద్యాసాగర్ మరణం నుంచి తాను ఇంకా కోలుకోలేదని, ప్రస్తుతం తన కూతురే తన ప్రపంచమని స్పష్టం చేసింది. ‘నేను ఒంటరి మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారా?’అని ఆవేదన వ్యక్తం చేస్తూ, తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దని కోరాడు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని పేర్కొంది.
VZM: చీపురుపల్లి టౌన్ వంగపల్లి పేటలో కాలువ పక్కన భారీగా చెత్త పేరుకుపోయింది. ఈ చెత్త వలన దోమల బెడద ఎక్కువగా ఉందని, దీంతో రోగలు బారిన పడే అవకాశం ఉంటుందని స్థానికులు భయపడుతున్నారు. శ్రీ కనకమాలక్ష్మి తల్లి పండగ తరుణంలో జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగిస్తారని స్థానికులు కోరుతున్నారు.
VZM: మెరకముడిదాం మండలం సిరియాల పేట గ్రామంలో రామాలయం నిర్మాణ చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి చీపురుపల్లి టీడీపీ మాజీ ఇంఛార్జ్ త్రిమూర్తులు రాజు రూ. 27,000 అందించారు. మోటర్ బోరు నిమిత్తం గ్రామస్థులు ఆయనను సంప్రదించగా ఈ సాహాయం అందించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ పనులు ముగింపు దశకు వచ్చాయని తెలిపారు.
ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ ఎద్మావతి తులసి తెలిపారు. మార్చి 31వ తేదీ ఫీజు చెల్లింపుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 27న ప్రవేశ పరీక్ష నిర్వహించి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తామన్నారు.
MNCL: తాండూర్ మండలం నీలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మాదారం పోచమ్మ ఆలయం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దొంగలు ట్రాన్స్ ఫార్మర్ పగలగొట్టి దానిలోని రాగి తీగలు దొంగలించుకుపోయారు. ఈ విషయమై విద్యుత్ AE కి,SI కి ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ పొలవేణి తిరుపతి స్పష్టం చేశారు.
ELR: జిలుగుమిల్లీ మండల పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను శనివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా.గోపి మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని వారికి తెలిపారు.
WGL: నల్లబెల్లి మండలంలోని ముచింపుల గ్రామపంచాయతీలో శనివారం గ్రామ కార్యదర్శి తొగరు అనిత ఆధ్వర్యంలో ఇంటి పన్ను వసూలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థులు తమ బకాయి పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే గ్రామంలో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
BDK: ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి రేంజ్లోకి ప్రవేశించిన పులి అడుగుజాడలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రైతులు, కూలీలు ఎవరూ వ్యవసాయం చేనులకు వెళ్ళొద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.