AP: ఇవాళ్టి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఉ.6 గం.లకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదర్శన ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉ. 7 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. రేపటి నుంచి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గం.ల వరకు దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు.