PDPL: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ప్రతులను TUCI ఆధ్వర్యంలో జ్యోతినగర్ మేడిపల్లి సెంటర్ వద్ద సోమవారం దగ్ధం చేశారు. TUCI జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్న ఈ కొత్త చట్టాలు కార్మికులకు శాపమని మండిపడ్డారు. పనిగంటల పెరుగుదల, భద్రత కరువుతో కార్మికులు నష్టపోతారన్నారని మండిపడ్డారు.