మంచిర్యాలలో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీలలో దండేపల్లి మండలంలోని గుడిరేవు పాఠశాలకు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. సోమవారం మంచిర్యాలలోని బాలుర జడ్పీ పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఇందులో రన్నింగ్ పోటీలో బొంగరాల మన్విక, స్టాండర్డ్ జంప్లో బొమ్మన అద్విక మంచి ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు.