MLG: ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమంతో పాటు గిరివాణి(గిరిజన దర్బార్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. గిరిజనులు, గిరిజనేతరులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అర్జీలు సమర్పించాలని సూచించారు.