హైదరాబాద్: 28°C
క్రైమ్

భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త

TG: హైదరాబాద్ మల్కాజ్‌గిరి పరిధిలోని మారుతీనగర్‌లో విషాద ఘటన జరిగింది. అనుమానంతో భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. ప్రైవేట్ వ్యాపారం చేస్తున్న నిందితుడు అరుణ్‌కు నేరచరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అంబర్‌పేట్‌లో అరెస్ట్ అయ్యాడు. ఈ ఏడాది మార్చిలోనే అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.