అన్నమయ్య: పీలేరు బండ్లవంక ప్రాంతా నికి చెందిన వంశీకృష్ణ(32) ఎలక్ట్రిషియన్.అతడు MNR కల్యాణ మండపంలో జరిగే వివాహ వేడుకలకు ఆదివారం విద్యుదీపాలంకరణ పనులకు వెళ్లాడు.అక్కడ విద్యుత్తు వంశీకృష్ణ స్తంభాన్ని ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతి చెందాడన్నారు.