MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ శివారులో ఉన్న పెద్ద చెరువు వద్ద పక్షులు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఆ చెరువు వద్దకు పలు రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఓరియంటల్ వైట్ ఇబ్బిస్, కామన్ కూట్ వంటి పక్షులు అక్కడకు చేరుకుంటున్నాయి. చెరువు ప్రాంతంలో ఆహారం, నీరు అందుబాటులో ఉండడంతో పక్షులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.