KMR: రాజంపేట మండలంలో కొత్తగా భూమి పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల ఏవో జ్యోత్స్న ప్రియా దర్శిని సూచించారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలతో సంబంధిత రైతు వేదికలకు వచ్చి దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
వార్తలు
రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏవో
Advertisement
Advertisement
Advertisement


