VKB: బొంరాస్పేట మండలం తుంకిమెట్ల గ్రామంలో వారాంతపు సంతకు సంబంధించి 2026-27సంవత్సరానికి తైబజార్ వేలంపాట సోమవారం ఉ.11గంటలకు నిర్వహించనున్నట్లు కార్యదర్శి సిద్దయ్య తెలిపారు. వేలంలో పాల్గొనేవారు గంట ముందుగా రూ.3,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఈ వేలం పాటను స్థానిక రైతు వేదిక భవనంలో నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు నిర్ణీత సమయానికి హాజరు కావాలని కోరారు.