NZB: పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్మూర్ మండలం అంక్సాపూర్లో ఐస్ క్రీమ్ ఆటోలు, బండ్ల ప్రవేశాన్ని నిషేధించినట్లు గ్రామ సర్పంచ్ ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించి గ్రామంలో ఐస్ క్రీమ్ విక్రయిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మన ఊరి పిల్లల ఉజ్వల భవిష్యత్తు, ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.