ప్రకాశం: దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామంలో శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవం నేడు జరగనున్నది. తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుణాల సందర్భంగా మూడు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేస్తన్నారు.