AP: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిచింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్లాపింగ్ కిందకు రాదని తేల్చింది. పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఈ మేరకు సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.