SRPT: పెన్పహాడ్ మండలంలోని ధర్మాపురం గ్రామంలో శుక్రవారం వింత ఘటన చోటుచేసుకుంది. స్థానిక మధిరామక్క చెరువులో నీటి కుక్క కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఉదయాన్నే ఈ వింత జీవిని చూసిన యువకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వార్త వైరల్గా మారింది. సముద్రాల్లో ఉండే జంతువు తమ చెరువులో కనిపించడంతో జనం ఎగబడ్డారు.