దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మృతుడు రాజా రఘువంశీ భార్య, ప్రధాన నిందితురాలు సోనమ్కు మేఘాలయ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిందితురాలికి దానికి గల సరైన కారణాలను, చట్టపరమైన సెక్షన్లను తెలపడంలో దర్యాప్తు సంస్థ పూర్తిగా విఫలమైందని కోర్టు తప్పుపట్టింది. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని ఆక్షేపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
వార్తలు
హనీమూన్ హత్య కేసు.. సోనమ్కు బెయిల్
Advertisement
Advertisement
Advertisement


