హైదరాబాద్: 28°C
క్రైమ్

పైప్‌లైన్ పేలి రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా రిఫైనరీలో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా సరఫరా చేసే పైప్‌లైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడే విధుల్లో ఉన్న 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement