సత్యసాయి: ముదిగుబ్బ మండలంలోని మంగళమడక, ఎన్పీ కుంట గ్రామాల్లో గురువారం ఉదయం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఉంచి సోదాలు చేపట్టారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐలు సునీత, శివరాముడు స్పష్టం చేశారు.