AP: నాలుగు ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులతో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భేటీ అయ్యారు. విజయనగరం కోటలోని మాన్సాస్ కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. పైడితల్లి, మందపల్లి మందేశ్వరస్వామి, సంతపేట జగన్నాథస్వామి, శ్రీకూర్మనాథస్వామి ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధి పనులపై ఈవోలు, పాలకమండలి సభ్యులతో చర్చించారు.