GDWL: ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని అందులో భాగంగా పశువులకు ఉచితంగా గాలికుంటు టీకాలు వేస్తున్నట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గాలికుంటు టీకాల ప్రచార వాహనాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో సుమారు 1.08 లక్షల పాడి పశువులు ఉన్నాయన్నారు.