VZM: తెలుగు వారి కొత్త సంవత్సరాధి ‘శ్రీ పరాభవ నామం’లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మాదిరి జీవితంలోని కష్టసుఖాల సమ్మేళనానికి ప్రతీకలని, ప్రజలందరూ ధైర్యంతో, ఉత్సాహంతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.