KRNL: ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం మహమ్మద్ ఆధ్వర్యంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం భాగంగా పబ్లిక్ హెల్త్ వర్కర్లకు ఆదివారం క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు పనులను ఒత్తిడిగా కాకుండా ఉత్సాహంతో నిర్వహించాలన్నారు.