NLG: నార్కట్పల్లిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్ రావు తెలిపారు. పట్టణంలో రోడ్డు వెడల్పు పనులతో పాటు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ తీగల మార్పిడి పనులు చేపడుతున్నందున తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.