KRNL: ఆదోని మండలంలో శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు తేలు కాటు బారిన పడ్డారు. బసాపురానికి చెందిన రామాంజీ, ఇస్వీకి చెందిన భారతి, రాయనగర్కు చెందిన శివకు తేలు కుట్టింది. ఇస్వీలో సీడ్స్ నారు పనులు చేస్తున్న సమయంలో భారతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు ఆదోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు GGHకి పంపించారు.
వార్తలు
ఆదోనిలో ఒకే రోజు ముగ్గురికి తేలుకాటు.!
Advertisement
Advertisement
Advertisement


