NLG: జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మార్చిలో బాధ్యతలు చేపట్టిన కమిటీ గడువు ఈనెల 12తో ముగిసింది. పదవీ కాలం పొడిగింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఛైర్మన్ జూకూరి రమేష్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.