కోనసీమ: ఆపదలో ఉండి వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవాడికి మన కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. శనివారం అమలాపురం పట్టణంలో ఉన్న తన క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలో 52 మంది లబ్ధిదారులకు సుమారు రూ.44 లక్షల 98 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.