కృష్ణా జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ బాలాజీ చర్యలు తీసుకున్నారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శించిన డోకిపర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-2) రజియా సుల్తానాను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జనాభా లెక్కల శిక్షణకు హాజరు కాకపోవడంతో వడ్లమన్నాడు సచివాలయ డీఏ కే.సురేంద్రకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.