ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన LAW విద్యార్థి ఎనిబేర బాబీ పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని MRPS ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజు మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం మార్కాపురం డీఎస్పీ, రూరల్ ఎస్సైను కలిసి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో పందిటి కాశిరావు, వినయ్, దేవ ప్రభాకర్ పాల్గొన్నారు.