NTR: జిల్లాను రహదారి భద్రతలో నెం.1గా నిలబెట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 123 బ్లాక్స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలను తగ్గించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు.