AP: తుళ్లూరు-తాడికొండ రోడ్డును మంత్రి నారాయణ పరిశీలించారు. ఆ రోడ్డు బాగా దెబ్బతిందని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రాజధానిలో పనుల వల్ల భారీ వాహనాలు వెళ్తున్నాయని.. దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. రాజధానిలో రోడ్లు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. విజయవాడ, గుంటూరు నుంచి అమరావతికి కనెక్టివిటీ పెంచుతున్నామని తెలిపారు.