GNTR: రాజధాని అమరావతిలో ఉండవల్లి వద్ద బకింగ్ హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. కాంట్రాక్టు సంస్థలు తెలిపిన ప్రకారం.. ఈ నెలాఖరులోగా బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అని తెలిపారు. ఈ బ్రిడ్జ్ వాహనదారులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని మంత్రి అన్నారు.