ASR: అనంతగిరి మండలం సరియా గ్రామంలో బుధవారం జాయింట్ కలెక్టర్ శ్రీపూజ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, భూ సమస్యలు, రేషన్ పంపిణీపై వివరాలు సేకరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
వార్తలు
సరియా గ్రామాన్ని సందర్శించిన జేసీ
Advertisement
Advertisement
Advertisement


