కడప నగర పరిధిలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం కిడ్నీ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కిడ్నీ విభాగాధిపతి డాక్టర్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం మన శరీరానికి ఎంతో అవసరం తెలిపారు. కిడ్నీ శరీరంలోని వ్యర్ధాలు తొలగించడం, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.