GDWL: జోగులాంబ అమ్మవారి ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో భారీగా ఆదాయం సమకూరిందని దేవాదాయ శాఖ అధికారి మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. లెక్కింపులో భాగంగా అమ్మవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న సొమ్ము రూ. 99,55,566 వచ్చినట్లు ఆయన ధ్రువీకరించారు. స్వామివారి హుండీని పండుగ తర్వాత లెక్కిస్తామని ఆయన పేర్కొన్నారు.