SRD: జహీరాబాద్ పట్టణంలో BRS పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావు పాల్గొని ముస్లిం సోదరులకు పండ్లు ఫలాలు తినిపించి, రోజా ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.