CTR: ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద కూటమి ప్రభుత్వం గురువారం కుప్పం నియోజకవర్గంలోని మత్స్యకారుల సొసైటీలకు సుమారు 77 వేల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. ఇందులో భాగంగా చిన్న బంగారునార్థం చెరువులో సుమారు 46 వేల చేప పిల్లలను అధికారుల సమక్షంలో చెరువులోకి వదిలారు. చేపలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు.