హైదరాబాద్: 28°C
భక్తి

రేపటి నుంచి తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం

Advertisement

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 26 నుంచి 28 వరకు జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఏటా ఈ మాసంలో మూడు రోజుల పాటు ఈ క్రతువును నిర్వహిస్తారు. మొదటిరోజు మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసేసి హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండోరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడో రోజు తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు.

Advertisement

Advertisement