VSP: జీవీఎంసీ 30వ వార్డు అఫీషియల్ కాలనీలో రూ.38 లక్షలతో బీటీ రోడ్ పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేజీహెచ్ పెడియాట్రిక్స్ వార్డులో పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన రూ.80 లక్షల విలువైన ఐసీయూ పరికరాలను ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు