తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10-12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండటంతో భక్తులు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లో ఉన్నారు. నిన్న శ్రీవారిని 57,682 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,020మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.