KRNL: పెద్దకడబూరులో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రభావతి దేవి ఆధ్వర్యంలో ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయి కుమార్ మాట్లాడుతూ.. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని రక్షిత మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.