NGKL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిందని అన్నారు.