MBNR: దేవరకద్ర మండలం నాగారం స్టేజీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం సంతలో గొర్రెలు అమ్మి తిరిగి వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్లో బాధితులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.